Friday, April 26, 2024

సీఎం కేసీఆర్​తో ప్రగతి భవన్​లో హేమంత్​ సోరేన్​ భేటీ..

ముఖ్యమంత్రి కేసీఆర్​తో ఝార్ఖండ్​ సీఎం హేమంత్​ భేటీ అయ్యారు. కుటుంబసభ్యులతో కలిసి ఇవాళ హైదరాబాద్ వచ్చిన సోరెన్… సాయంత్రం ప్రగతిభవన్​కు వచ్చారు. సీఎం కేసీఆర్​తో సమావేశమయ్యారు. జాతీయ రాజకీయాలు, కేంద్ర ప్రభుత్వ వైఖరి సహా ఇతర అంశాలపై ఇరువురూ చర్చించే అవకాశం ఉంది. గతంలోనూ హేమంత్ సోరెన్ హైదరాబాద్​లో కేసీఆర్​తో సమావేశమయ్యారు. ఇటీవల రాంచీ వెళ్లిన సీఎం కేసీఆర్… గాల్వాన్ లోయలో మరణించిన ఝార్ఖండ్​కు చెందిన సైనికుల కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఆర్థికసాయం అందించారు. దేశ పరిస్థితులు, రాజకీయాలు సహా ఇతర అంశాలపై చర్చించారు. తాజాగా మరోమారు ఇరువురు ముఖ్యమంత్రులు హైదరాబాద్ వేదికగా భేటీ అయ్యారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement