Saturday, May 4, 2024

లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డ సర్వేయర్..

ములుగు జిల్లాలోని ఏటూరు నాగారం తహసీల్ ఆఫీస్ లో ఏసీబీ దాడులు జరిగాయి. రూ.10వేలు లంచం తీసుకుంటూ సర్వేయర్ బచ్చు మహేందర్ ఏసీబీకి చిక్కారు. భూమి కొలత కోసం రైతు ఎర్రబెల్లి మనోహర్ నుంచి లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. మహేందర్ ఏటూరునాగారం తహశీల్దార్ కార్యాలయంలో ఔట్ సోర్సింగ్ ఉద్యోగిగా పనిచేస్తున్నారు. మహేందర్ ను ఏసీబీ అధికారులు అరెస్టు చేసి విచారణ చేపట్టారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement