Tuesday, April 23, 2024

విరూపాక్ష టీజ‌ర్ చూసిన ప‌వ‌న్ క‌ల్యాణ్‌.. థ్యాంక్యూ మామా అంటోన్న‌ హీరో

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ల్యాన్ విరూపాక్ష టీజ‌ర్ ని వీక్షించారు. ఇదే విషయాన్ని సాయిధరమ్‌ తేజ్‌ సోషల్‌ మీడియాలో తెలిపారు. విరూపాక్ష టీజర్‌ చూసి పవన్‌ కళ్యాణ్‌.. చిత్రబృందాన్ని అభినందించినట్లు సాయిధరమ్ తేజ్‌ తెలిపారు..ఇంతకంటే ఇంకేమి అడగలేను. విరూపాక్ష మూవీ నాకెంతో కీలకం. నా గురువు పవన్‌ కళ్యాణ్‌ ఈ సినిమా టీజర్‌ చూసి బ్లెస్సింగ్స్‌ ఇవ్వడం ఎంతో సంతోషాన్నిచ్చింది. థ్యాంక్యూ మామా’ అంటూ పవన్‌ ఫోటోలను షేర్‌ చేశారు. ప్రస్తుతం ఈ ట్వీట్‌ నెట్టింట తెగ వైరల్‌ అవుతుంది. కార్తిక్‌ దండు దర్శకత్వంలో ‘విరూపాక్ష’ అనే థ్రిల్లర్‌ సినిమాలో న‌టిస్తున్నారు హీరో సాయి ధ‌ర‌మ్ తేజ్. షూటింగ్‌ పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనులలో బిజీగా ఉంది. శ్రీ వెంకటేశ్వరా సినీ చిత్ర బ్యానర్‌పై బీవీఎస్‌ఎన్‌ ప్రసాద్‌ ఈ సినిమాను నిర్మిస్తున్నారు.మిస్టరీ థ్రిల్లర్‌ నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రానికి క్రియేటీవ్‌ డైరెక్టర్‌ సుకుమార్‌ కథ, స్క్రీన్‌ప్లే అందించడంతో పాటు సహా నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. సాయి ధరమ్‌కు జోడీగా సంయుక్త హెగ్డే నటిస్తుంది. ఈ సినిమా ఏప్రిల్ 21న పాన్‌ ఇండియా స్థాయిలో రిలీజ్‌ కానుంది. ఈ సినిమా టీజర్‌ మార్చి 1న రిలీజ్‌ కానునన్నట్లు చిత్రబృందం ఇటీవలే తెలిపింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement