Wednesday, May 15, 2024

TS | సంక్షేమ ప్రభుత్వానికి స‌పోర్టు.. బీఆర్ఎస్ లోకి పెద్ద ఎత్తున చేరికలు

శంకర్ పల్లి (ప్రభ న్యూస్) : రంగారెడ్డి జిల్లా శంకర్ పల్లి మున్సిపాలిటీలో అభివృద్ధి, సంక్షేమం దూకుడు మీదుంది.. దీంతో చాలామంది ఇత‌ర పార్టీల నుంచి సీఎం కేసీఆర్ కు స‌పోర్టుగా నిలిచేందుకు బీఆర్ ఎస్ పార్టీలో చేరుతున్నారు. బుల్కపుర్ లోని 4వ వార్డు, 5వ వార్డుకు చెందిన కాంగ్రెస్, బీజేపీలకు చెందిన పలువురు కార్యకర్తలు ఇవ్వాల BRS గూటికి చేరారు. వారిని ఎమ్మెల్యే కాలే యాదయ్య గులాబీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. బీఆర్ఎస్ పార్టీ చేస్తున్న  అభివృద్ధి, సంక్షేమ పథకాలకు ఆకర్షితులై రాబోయే రోజుల్లో పెద్ద సంఖ్యలో చేరికలు ఉంటాయన్నారు.

దేశ రాజకీయాల‌లో క్రియాశీల పాత్ర పోషించాలనుకుంటున్న సీఎం కేసీఆర్ అడుగులో అడుగులు వేసే విధంగా ఇతర పార్టీల కార్యకర్తలు బి.ఆర్.ఎస్. వైపు మొగ్గు చూపుతున్నారని తెలిపారు. గ్రామాల్లో బిజెపి, కాంగ్రెస్ పార్టీ నాయకులు చేస్తున్న కుట్రలను ప్రతి కార్యకర్త సరైన రీతిలో బుద్ది చెప్పాలన్నారు. ప్రతి కార్యకర్తకు అండగా ఉంటానన్నారు. మున్సిపాలిటీ కేంద్రంలో నవనిర్మాన్ వారు ఏర్పాటు చేసిన సెంట్రల్ లైటింగ్, అంబేద్కర్ భవన ఆధునీకరణకు కోటి రూపాయలు మంజూరు చేయడం, బుల్కాపూర్ చెరువు పరిశీలన, కోటి ఆరు లక్షల రూపాయల నిధులతో దుకాణ సముదాయాలను ప్రారంభించారు ఈ కార్యక్రమంలో మండల ముఖ్య నాయకులు, బి.ఆర్.ఎస్.నాయకులు,కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement