ఐర్లాండ్తో భారత జట్టు టీ20 మ్యాచ్లను ఆడనుంది. ఇవ్వాల తొలి మ్యాచ్ జరగనుంది. మూడు మ్యాచ్ ల టీ20 సిరీస్ లో భాగంగా.. టాస్ గెలిచిన టీమిండియా కప్టెన్ బు్మ్రా బౌలింగ్ ఎంచుకోగా మరి కొద్ది సేపట్లో మ్యాచ్ ప్రారంభం కానుంది. ఇక.. వెస్టిండీస్ తో భారత్ ఐదు మ్యాచ్ల T20 సిరీస్ తర్వాత, జస్ప్రీత్ బుమ్రా నేతృత్వంలోని టీమ్ ఇండియా ఇవ్వల్టి నుండి (శుక్రవారం) ఐర్లాండ్తో మూడు మ్యాచ్ ల T20Iలను ఆడనుంది. ఐర్లాండ్ లోని డబ్లిన్ విలేజ్ స్టేడియం ఈ సిరీస్ కు వేధిక కానుంది.
కాగా, ఐర్లాండ్ తో ఢీకొననున్న భారత జట్టులో బుమ్రాతో పాటు, రుతురాజ్ గైక్వాడ్ (వైస్ కెప్టెన్), తిలక్ వర్మ, యశస్వి జైస్వాల్, రింకు సింగ్, ప్రసిద్ధ్ కృష్ణ వంటి యువ ఆటగాళ్లు ఉన్నారు. అలాగే ఐపీఎల్ లో రాజస్థాన్ రాయల్స్ తరుపున ఆడిన పేసర్ ప్రసిద్ధ్ 11 నెలల తర్వాత రీఎంట్రీ ఇవ్వనున్నాడు.
ఆగస్టు 31 నుండి ప్రారంభం కానున్న ఆసియా కప్ 2023కి ముందు జరగనున్న ఈ సిరీస్ లో బుమ్రా, ప్రసిద్ధ్లు వారి పూర్తి ఫిట్నెస్ను నిరూపించుకోవాల్సిన అవసరం ఉంది.. దీంతో వీరిద్దరికి ఈ సిరీస్ మరింత కీలకంగా మారనుంది. టీ20 ఆడేందుకు టీమిండియా ఐర్లాండ్ టూర్ వెళ్లడం వరుసగా ఇది రెండోసారి. ఇదివరకు 2022లో హార్దిక్ పాండ్యా నేతృత్వంలోని జట్టు రెండు మ్యాచ్ల టీ20 సిరీస్ను 2-0తో కైవసం చేసుకుంది.
భారత జట్టు : జస్ప్రీత్ బుమ్రా (కప్టెన్), రుతురాజ్ గైక్వాడ్, యశస్వి జైస్వాల్, సంజు శాంసన్, తిలక్ వర్మ, రింకూ సింగ్, శివం దూబే, వాషింగ్టన్ సుందర్, అర్ష్దీప్ సింగ్, రవి బిష్ణోయ్, ప్రసిద్ కృష్ణ.
ఐర్లాండ్ జట్టు : పాల్ స్టిర్లింగ్ (కప్టెన్), ఆండీ బల్బిర్నీ, లోర్కాన్ టక్కర్, హ్యారీ టెక్టర్, కర్టిస్ కాంఫర్, జార్జ్ డాక్రెల్, మార్క్ అడైర్, బారీ మెక్కార్తీ, క్రెయిగ్ యంగ్, జోష్ లిటిల్, బెన్ వైట్.