Thursday, May 2, 2024

Support – రాహుల్ గాంధీ భారత్ జోడో న్యాయ్ యాత్ర – తన కారుకి స్వయంగా యాత్ర పోస్టర్ ను అంటించిన రేవంత్

హైదరాబాద్ – ఈ నెల 14 నుంచి ప్రారంభం కానున్న రాహుల్ గాంధీ భారత్ జోడో న్యాయ్ యాత్ర. నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి తన సొంత వాహనంపై యాత్ర స్టిక్కర్ అతికించి మద్దతు తెలిపారు.

ఈ సందర్భంగా రేవంత్ twit చేస్తూ. “ఈ నెల 14న భారతదేశంలో మరో మహా యాత్రకు రాహుల్ గాంధీ శ్రీకారం చుడుతున్నారు. గాయపడ్డ మణిపూర్ నుండి ముంబై వరకు భారత్ జోడో న్యాయ్ యాత్రకు సిద్ధమవుతున్నారు. నికార్సైన కాంగ్రెస్ కార్యకర్తగా నాయకుడి యాత్రకు నా సంఘీభావాన్ని సింబాలిక్ గా తెలిపేందుకు యాత్ర పోస్టర్ ను నేనే స్వయంగా నా వాహనానికి అతికించి ప్రతి కార్యకర్తకు కర్తవ్య బోధ చేస్తున్నాను” అని పేర్కొన్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement