Sunday, May 5, 2024

Andhra Pradesh – ప్రభుత్వంతో చర్చలు సఫలం – సమ్మె విరమించిన మునిసిపల్ కార్మికులు

తెనాలిటౌన్, జనవరి ప్రభన్యూస్ – ము.న్సిపల్ కార్మికులతో ప్రభుత్వం చర్చలతో తాత్కాలికంగా సమ్మె విరమిస్తున్నట్లు నాయకులు ప్రకటించారు. దీంతో గురువారం నుంచి మున్సిపల్ కార్మికులు విధుల్లో చేరనున్నారు. మున్సిపల్ కార్మికులతో ప్రభుత్వం జరిపిన చర్చలు సంతృప్తి కరంగా లేనప్పటికి తాత్కాలికంగా సమ్మె విరమిస్తున్నట్లు చెప్పారు.

సచివాలయంలో మున్సిపల్ కార్మికుల సంఘాలతో మంత్రులు చర్చలు జరిపిన చర్చలు సఫలం అయినట్లు చెప్పారు. మున్సిపల్ కార్మికులు విధులు చేరేందుకు అంగీకరించారు. దీంతో మున్సిపల్ కార్మికుల సమ్మెకు తెరపడినట్లయింది. కార్మికుల డిమాండ్లను కొన్నింటిని ప్రభుత్వం అంగీకరించినప్పటికి అయితే జీవో వచ్చాక పూర్తి స్థాయిలో సమ్మె విరమిస్తామని కార్మిక సంఘాల నాయకులు అన్నారు.

గత రెండు వారాల నుంచి ఆంధ్రప్రదేశ్ లో సమ్మె చేస్తుండటంతో ఎక్కడి చెత్త అక్కడే పేరుకుపోయింది. ఆయా ప్రాంతాల్లో మురుగు నీటి తోదుర్గంధం నెలకొంది. మున్సిపల్ కార్మికుల డిమాండ్లను కొంత వరకూ అంగీకరించింది. మరికొన్నింటిని ఎన్నికల తర్వాత పరిష్కరిస్తామని హామీ ఇవ్వడంతో కార్మికులు సమ్మెను విరమించి గురువారం. నుండి విధులకు హాజరు కానున్నట్లు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement