Wednesday, May 1, 2024

TS: సభాపతి పోచారంకు ఇబ్రహీంపేట తాండవాసుల మద్దతు

కామారెడ్డి జిల్లా : బాన్సువాడ నియోజకవర్గం భారత రాష్ట్ర సమితి పార్టీ అభ్యర్థి పోచారం శ్రీనివాసరెడ్డికి బాన్సువాడ మండలంలోని ఇబ్రహీంపేట తాండా వాసులు సంపూర్ణ మద్దతు ప్రకటించారు. గత నలబై సంవత్సరాలుగా పోచారం శ్రీనివాసరెడ్డి తామంతా కుటుంబ సభ్యులుగా కలిసి, మెలిసి ఉన్నామని, కష్ట సుఖాల్లో నిత్యం తాండా వాసులకు తోడుగా ఉన్న నాయకుడు పోచారం అని గిరిజనులు తెలిపారు. తమ తాండాను గ్రామ పంచాయతీగా ఏర్పాటు చేయడంతో పాటుగా తాండాలో పనుల కోసం కోట్ల రూపాయల నిధులు మంజూరు చేసినందుకు కృతజ్ఞతగా పోచారం శ్రీనివాసరెడ్డికి ఏకగ్రీవంగా మద్దతు తెలుపుతున్నామని తెలిపారు.

పోచారం శ్రీనివాసరెడ్డికి బాన్సువాడ అసెంబ్లీ నియోజకవర్గం నుండి MLA గా అవకాశం కల్పించిన BRS పార్టీ అధ్యక్షులు, రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కి తాండా వాసులు కృతజ్ఞతలు తెలిపారు.గులాబీ జెండా తప్ప తమ తాండాలో వేరే జెండాలకు అనుమతి లేదని, ఎన్నికల ప్రచారం కోసం వేరే పార్టీల అభ్యర్థులు తమ గ్రామానికి రావద్దని తాండా వాసులు స్పష్టం చేశారు. ఈకార్యక్రమంలో ఇబ్రహీంపేట గ్రామ సర్పంచ్ నారాయణరెడ్డి, ఇబ్రహీంపేట గ్రామ BRS పార్టీ అధ్యక్షుడు శ్రీనివాస్ రెడ్డి, రైతుబంధు సమితి గ్రామ కన్వీనర్ నారాయణరెడ్డి, నాయకులు రాజిరెడ్డి, గ్రామస్తులు. ఇబ్రహీంపేట్ తాండ సర్పంచ్ ప్రేమ్ సింగ్, ఉపసర్పంచ్ గణేష్, మోహన్ నాయక్, కిషన్ నాయక్ పలువురు వార్డు సభ్యులు తండావాసులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement