Sunday, April 28, 2024

TS: అస్వస్థతకు గురైన విద్యార్థులను పరామర్శించిన కాంగ్రెస్ నేత మానాల

నిజామాబాద్ సిటీ, సెప్టెంబర్ 12(ప్రభ న్యూస్): ఫుడ్ పాయిజన్ తో అస్వస్థతకు గురైన విద్యార్థులను జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు మానాల మోహన్ రెడ్డి పరామర్శించారు. నిజామాబాద్ జిల్లా భీంగల్ లోని కస్తూర్భా గాంధీ బాలికల హాస్టల్ లో సోమవారం రాత్రి ఫుడ్ పాయిజన్ జరిగి విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు.

అస్వస్థతకు గురైన విద్యార్థులను చికిత్స నిమిత్తం నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకువచ్చారు. ఇవాళ జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు మానాల మోహన్ రెడ్డి ప్రభుత్వాసుపత్రిలో విద్యార్థినులతో, వారి తల్లిదం డ్రులతో మాట్లాడారు. వారి ఆరోగ్య పరిస్థితులు.. ఫుడ్ పాయిజన్ కు గల కారణాలను అడిగి తెలుసుకున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement