Tuesday, April 30, 2024

మూగ జీవాలను కాపాడిన సుల్తానాబాద్ ఎస్సై

మేతకు వెళ్లి ప్రమాదవశాత్తు బావిలో పడిన 25 గేదెలను సురక్షితంగా సుల్తానాబాద్ పోలీసులు కాపాడారు. బుధవారం పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలంలోని తొగర్రాయి గ్రామంలో బొంగోని నరసయ్య కు చెందిన ఇరువై గేదెలు మేత కోసం వెళ్లి ప్రమాదవశాత్తు బావిలో పడ్డాయి. ఈ విషయమై గ్రామస్తులు స సుల్తానాబాద్ ఎస్సై విజయేందర్ కు సమాచారం అందించారు. హుటాహుటిన తన సిబ్బంది డి. కిరణ్, తిరుపతి నాయక్ లతో భావి వద్దకు తన చేరుకొని రెండు గంటలు శ్రమించి ఇరువై గేదెలను స్థానిక యువకులతో కలిసి బయటకు తీశారు. తన గేదెలను కాపాడినందుకు బొంగోని నరసయ్య సుల్తానాబాద్ ఎస్సై విజయేందర్ కు కృతజ్ఞతలు తెలియజేశాడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement