Wednesday, May 1, 2024

RR: శంకర్ పల్లి రైల్వే స్టేషన్ పరిధిలో యువకుడి ఆత్మహత్య

రంగారెడ్డి, జిల్లా శంకర్ పల్లి (ప్రభ న్యూస్) : శంకరపల్లి రైల్వే స్టేషన్ పరిధిలో సంతోష్ కుమార్ అనే యువకుడు రైలు పట్టాలపై పడుకొని ఇవ్వాళ ఆత్మహత్య చేసుకున్నాడు. వికారాబాద్ రైల్వే పోలీసుల అందించిన సమాచారం మేరకు వివరాలు ఈ క్రింది విధంగా ఉన్నాయి..

శంకర్ పల్లి పట్టణానికి చెందిన న్యాలం సంతోష్ కుమార్ (30) అనే యువకుడు శంకర్ పల్లిలో నివాసం ఉంటున్నాడు. ఇంటర్మీడియట్ వరకు చదువుకున్న ఈ యువకుడు ఆర్థిక పరిస్థితులు సహకరించక మానసిక పరిస్థితి బాగాలేక గత రెండు మూడు రోజుల నుండి మదనపడుతూ చివరకు ఆత్మహత్య చేసుకున్నాడని వారు పేర్కొన్నారు. వికారాబాద్ రైల్వే స్టేషన్ మాస్టర్ అందించిన సమాచారం మేరకు వికారాబాద్ రైల్వే పోలీసులు కేసు నమోదు చేసుకొని శవ పంచనామా కోసం మృతదేహాన్ని వికారాబాద్ కు తరలించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement