Sunday, May 5, 2024

west godavari : నైటీలు ధరిస్తే భారీగా ఫైన్

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పశ్చిమ గోదావరి జిల్లా తోకలపల్లి గ్రామంలో మహిళలు, యువతులు పగటిపూట నైటీలను వేసుకోవటాన్ని గ్రామపెద్దలు నిషేధించారు. పగటిపూట వీటిని వేసుకొంటే రెండు వేలు జరిమానా, చూసి చెప్పిన వారికి వెయ్యి బహుమానం ఇస్తారట.

ఈ విషయం అధికారుల దృష్టికి వెళ్లడంతో నిడమర్రు ఎమ్మార్వో ఎం.సుందర్రాజు ఎస్ఐ విజయకుమార్ గ్రామంలో పర్యటించి వాస్తవాలు తెలుసుకొన్నారు. తెలుగు సాంప్రదాయం, సంస్కృతిని కాపాడాలనే ధ్యేయంతో పగటిపూట మహిళలు నైటీలను ధరించి రహదారులపైకి రాకూడదని నిర్ణయం తీసుకున్నట్లు గ్రామ పెద్దలు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement