Thursday, April 25, 2024

పాముకాటుకు విద్యార్థిని మృతి

పెద్దమందడి, మార్చ్ 6 (ప్రభ న్యూస్) : మండల పరిధిలోని చిన్న మందడి గ్రామంలో ఆదివారం బోయ లావణ్య (11) అనే విద్యార్థిని పాముకాటుకు గురై మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. తండ్రి బొయ్య సత్యం భార్య పుష్ప వివరాల ప్రకారం… ఆదివారం పాఠశాలకు సెలవు కావడంతో వ్యవసాయ పొలానికి రావడంతో సాయంకాలం పాము కాటుకు గురైనట్లు వారు తెలిపారు. ఆదివారం రాత్రి మృతి చెందినట్లు వారు తెలిపారు. అదే గ్రామంలోని పాఠశాలలో లావ‌ణ్య‌ 5వ తరగతి చదువుతున్న‌ట్లు వారు తెలిపారు. సోమవారం స్థానిక వనపర్తి గొర్రెల డైరెక్టర్ నాగేంద్రం యాదవ్. స్థానిక సర్పంచ్ సూర్య చంద్రారెడ్డి, గ్రామ నాయకులు పరామర్శించారు. మొన్న జరిగిన స్వయం పరిపాలన దినోత్సవంలో ఉపాధిగా పాల్గొని ఒక రోజు తోటి విద్యార్థులకు పాఠాలను బోధించినట్లు గ్రామస్తులు తెలిపారు. విద్యార్థిని చ‌నిపోవ‌డంతో గ్రామ‌స్తులు కన్నీటి వీడ్కోలు పలికారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement