Friday, March 29, 2024

నంద్యాల‌ జిల్లాలో పెద్దపులుల సంచారం.. భ‌యాందోళ‌న‌లో గ్రామ‌స్తులు (Video)

నంద్యాల జిల్లాలో పెద్దపులుల సంచారం క‌ల‌క‌లం రేపుతోంది. నందికొట్కూరు నియోజకవర్గంలోని కొత్తపల్లి మండలం పెద్ద గుమ్మడాపురం సమీపంలో నల్లమల్ల అడవుల నుంచి బయటికి వచ్చిన పెద్దపులి పిల్ల కూనలు సంచ‌రిస్తున్నాయి. గ్రామంలోని ఓ గడ్డివాములో పులి కూనలు దాగి ఉండగా గమనించిన స్థానికులు వాటిని ఓ గదిలో వదిలి అటవీ అధికారులకు సమాచారం అందించారు. హుటాహుటిన అక్క‌డికి చేరుకున్న అధికారులు కూన‌పిల్ల‌ల‌ను అక్క‌డి నుంచి తీసుకెళ్లారు. ప్ర‌జ‌లు అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని సూచించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement