Saturday, May 4, 2024

ట్రినిటీ లో విద్యార్థుల హంగామా

కరీంనగర్ జిల్లా : ట్రినిటీ కళాశాల వార్షికోత్సవ సంబరాల్లో విద్యార్థులు హంగామా చేశారు. నగరంలోని గోపికృష్ణ ఫంక్షన్ హాల్లో నిర్వహించిన వార్షికోత్సవ వేడుకలు విద్యార్థినిలు ఆడి పాడారు. క్లాసికల్ సోలో విభాగాల్లో నృత్యాలు అలరించాయి. వేడుకల్లో ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి మాట్లాడుతూ విద్యార్థులు కష్టపడి చదివి పరీక్షలకు సిద్ధం కావాలన్నారు. నాణ్యమైన విద్య అందించడమే లక్ష్యంగా ట్రినిటీ విద్యాసంస్థలు కృషి చేస్తున్నాయన్నారు. వేడుకల్లో విద్యాసంస్థల చైర్మన్ దాసరి ప్రశాంత్ రెడ్డి తో పాటు అధ్యాపకులు పెద్ద సంఖ్యలో విద్యార్థులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement