Saturday, May 4, 2024

NZB: స్పీకర్ పోచారం స్వగ్రామంలో రామాలయ నిర్మాణం

తన స్వగ్రామం బాన్సువాడ మండలం పోచారం గ్రామంలో నిర్మించనున్న రామాలయ నిర్మాణానికి స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి భూమిపూజ చేశారు. రూ. 50 లక్షలతో నూతనంగా నిర్మించనున్న శ్రీ సీతారామాలయ నిర్మాణానికి ఆదివారం ఉదయం సతీసమేతంగా భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా స్పీకర్ పోచారం.. ప్రజలందరికీ శ్రీరామ నవమి శుభాకాంక్షలు తెలిపారు. దేవాదాయ దర్మాధాయ శాఖ సహకారంతో రూ.50 లక్షలతో రామాలయ నిర్మాణం జరుగుతుందన్నారు. ఆలయ నిర్మాణానికి నిధులు మంజూరు చేసిన సీఎం కేసీఆర్, దేవాదాయ, ధర్మాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డికి స్పీకర్ పోచారం ధన్యవాదాలు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement