Wednesday, May 1, 2024

Shamshabad – ఎయిర్‌పోర్టులో రూ.6కోట్ల విలువైన వజ్రాలు పట్టివేత

శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో రూ.6కోట్ల విలువైన వజ్రాలు, విదేశీ కరెన్సీని స్వాధీనం చేసుకున్నారు. డీఆర్‌ఐ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం….హైదరాబాద్‌కు చెందిన ఇద్దరు వ్యక్తులు దుబాయ్‌ వెళ్లేందుకు శంషాబాద్‌ విమానాశ్రయానికి వచ్చారు. వారి ప్రవర్తనపై అనుమానం రావడంతో అదుపులోకి తీసుకుని సామగ్రిని క్షుణ్నంగా తనిఖీ చేశారు. చాక్లెట్‌ కవర్లలో ప్రత్యేకంగా ప్యాక్‌ చేసిన రూ.6 కోట్ల విలువైన డైమండ్స్‌, రూ. 9.83 లక్షల విదేశీ కరెన్సీ, రూ.లక్ష నగదు గుర్తించారు. సరైన ఆధారాలు లేకపోవడంతో ఇద్దరు ప్రయాణికులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు

Advertisement

తాజా వార్తలు

Advertisement