Saturday, May 4, 2024

WGL | తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం సేవలు అభినందనీయం: కలెక్టర్ భవేష్ మిశ్రా

భూపాలపల్లి ప్రతినిధి (ప్రభన్యూస్): జయశంకర్ భూపాలపల్లి జిల్లా తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం సేవలు అభినందనీయమని జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా కొనియాడారు. జిల్లాలో ఇటీవల కురిసిన భారీ వర్షాలకు అతలాకుతలమైన మోరంపల్లి, ఇతర గ్రామాల కి చేయూతనివ్వాలని సంకల్పంతో టీజీఓ జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఆధ్వర్యంలో గెజిటెడ్ అధికారులు , వైశ్య గెజిటెడ్ అధికారుల నుండి విరాళాంగా రూ. 2,27,122లు సేకరించి సదరు చెక్కును సోమవారం జిల్లా అధ్యక్షులు సామ్యూల్ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ కు అందచేశారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలోని అధికారులు తమ వంతుగా అందించిన ఈ సహకారాన్ని వరదల ద్వారా సర్వం కోల్పోయినటువంటి దెబ్బతిన్న గ్రామాల కుటుంబాలకు అందించే విధంగా చర్యలు తీసుకుంటానని, ఆర్థిక సహకారం అందించిన టీజీఓ అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జయశంకర్ భూపాలపల్లి జిల్లా గెజిటెడ్ అధికారుల సంఘం అధ్యక్షులు సామ్యూల్ , కార్యదర్శి పెద్ది ఆంజనేయులు, సహాధ్యక్షులు శైలజ, జాయింట్ సెక్రటరీ వి. శ్రీధర్, వైస్ ప్రెసిడెంట్ సంజీవరావు , జెడ్పీ సీఈవో విజయలక్ష్మి, డిపిఓ ఆశాలత , డిఏఓ విజయభాస్కర్ ఎంపీడీవోలు అరుంధతి, సురేందర్, ఇతర అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement