Friday, May 10, 2024

అక్రమ రవాణాకు సిద్ధంగా ఉన్న 100 క్వింటాళ్ల‌ బియ్యం పట్టివేత

కొత్తగూడ : మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలంలోని గోపాలపురం గ్రామం అటవీ ప్రాంతంలో పీడీఎస్ బియ్యం అక్రమంగా నిల్వ ఉంచిన సమాచారం మేరకు స్థానిక ఎస్ఐ నాగేష్ అక్కడికి చేరుకుని అక్రమంగా నిల్వ ఉంచిన దాదాపు 100 క్వింటాళ్ల పీడీఎస్ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన రేషన్ బియ్యాన్ని పోలీస్ స్టేషన్ కు తరలించారు. త్వరలో నిందితులపై క్రిమినల్‌ కేసులు నమోదు చేయనున్నట్లు తెలిపారు. రేషన్‌ బియ్యం కొన్న, విక్రయించిన సంబంధిత వ్యక్తులపై కఠిన చర్యలు తప్పవన్నారు. ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement