Thursday, May 2, 2024

టీడీపీ కుప్పం కోట బద్దలైంది: విజయసాయిరెడ్డి

కుప్పం మున్సిపల్ ఎన్నికల ఫలితాలలో అధికార వైసీపీ 15 స్థానాలు గెలుచుకుంది. దాంతో చైర్ పర్సన్ స్థానాన్ని వైసీపీ సొంతం చేసుకుంది. టీడీపీ అధినేత చంద్రబాబు సొంత నియోజకవర్గంలోని కుప్పం మున్సిపాలిటీలో వైసీపీ జయభేరి మోగించిడంతో వైసీపీ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. టీడీపీ కుప్పం కోట బద్దలు అయ్యిందని ఆయన అన్నారు. ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు సొంత నియోజకవర్గంలోని కుప్పం మున్సిపాలిటీలో వైఎస్ఆర్సీపీ రికార్డు విజయం సాధించిందని తెలిపారు. చంద్రబాబును రాష్ట్రమంతటితోపాటు ఏళ్లుగా గెలిపిస్తున్న కుప్పం ప్రజలు కూడా నమ్మలేదని దీంతో అర్ధమైపోయిందని విజయసాయి రెడ్డి వ్యాఖ్యానించారు. ఈ మేరకు ఆయన ట్విట్ చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement