Thursday, May 2, 2024

Security – జంక్షన్ లలో పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయాలి – హిందూ వాహిని

తాంసి జూన్ 21(ప్రభాన్యూస్) : బక్రీద్ పండుగ కు అక్రమ గో రవాణాను అరికట్టేందుకు తాంసి మండలంలోని జంక్షన్ లలో పోలీస్ పికేటింగ్ ఏర్పాటు చేసి బందోబస్తు నిర్వహించాలని తాంసి మండల హిందూ వాహిని శాఖ అధ్యక్షుడు ఏలేటి చంద్ర కిరణ్ కోరారు. బుధవారం ఆదిలాబాద్ జిల్లా తాంసి మండలంలోని పోలీస్ స్టేషన్లో హిందూ వాహిని శాఖ తరపున పోలీసులకు వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మండలంలోని పలు గ్రామాల కూడలలో అక్రమ గోమాంస విక్రయాన్ని అరికట్టాలని కోరారు.వినతిపత్రం అందజేసిన వారిలో మండల హిందువాహిని సభ్యులు మహేందర్, శ్రీనివాస్, శేఖర్,సాయి, నిఖిల్, వినయ్,శివ శంకర్ ఉన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement