Sunday, May 12, 2024

శంకర్ పల్లి హనుమాన్ మందిర్ లడ్డు 13 లక్షల 13వేల 313 కు దక్కించుకున్న జైపాల్ యాదవ్

రంగారెడ్డి జిల్లా శంకర్ పల్లి (ప్రభ న్యూస్) శంకర్పల్లి మున్సిపాలిటీ కేంద్రంలోని విఠలేశ్వర స్వామి ఆలయ( హనుమాన్ మందిర్) ప్రాంగణంలో ప్రతిష్టించిన గణనాథుడి చేతిలోని లడ్డుని పదమూడు లక్షల పదమూడు వేల మూడువందల పదమూడు రూపాయలకు మున్సిపాలిటీ పరిధిలోని అయ్యపు రెడ్డిగూడెం చెందిన బొమ్మన గారి జైపాల్ యాదవ్ దక్కించుకున్నారు.

ఆయనకు పట్టణ ప్రముఖులు నిర్వాహకులు వేలం పాటలో దక్కించుకున్న లడ్డును అందజేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వినాయకుడి చేతిలోని లడ్డును దక్కించుకోవడం ఆనందంగా ఉన్నదని గణనాథుడు అందరినీ చల్లగా కాపాడాలని ఆయన వేడుకున్నట్లు తెలిపారు

Advertisement

తాజా వార్తలు

Advertisement