Sunday, April 28, 2024

Sangareddyజిల్లాలో ఘోరం… నిర్మిస్తుండ‌గా కూలీన చర్చి..న‌లుగురు మృతి

సంగారెడ్డి, జనవరి 7 (ప్రభ న్యూస్): సంగారెడ్డి జిల్లా కోహీర్ లో ప్రమాదం, నిర్మాణంలో ఉన్న ఓ చర్చి కుప్పకూలింది. ఈ ఘటనలో ఆరుగురు శిధిలాల కింద చిక్కుకోగా అందులో ఇద్దరు పరిస్థితి విషమంగా ఉంది.

తీవ్ర గాయాలైన వారిని చికిత్స నిమిత్తం సంగారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. భవన శిథిలాల కింద ఉన్న నలుగురు కూలీల సమాచారం అందుకున్న పోలీసులు, రెస్య్కూ బృందాలు ఘటన స్థలానికి చేరుకుని సహయక చర్యలు ప్రారంభించారు. శిథిలాల కింద చిక్కుకున్న నలుగురు కోసం సహకయ చర్యలు కొనసాగుతున్నాయి. అయితే, చర్చి స్లాబ్ వేస్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. కాగా, ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement