Saturday, April 27, 2024

సమ్మక్క జాతర వైభవంగా జరుపుతాం : ఎమ్మెల్యే కోరుకంటి

ఫిబ్రవరి మాసంలో జరిగే శ్రీ సమ్మక్క సారలమ్మ జాతరను కనుల పండుగగా నిర్వహిస్తామని రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్‌ పేర్కొన్నారు. బుధవారం గోలివాడ గోదావరి నది తీరంలో నూతనంగా సమ్మక్క- సారలమ్మ గద్దెల పున: నిర్మాణంలో భాగంగా ఎమ్మెల్యే భూమి పూజ చేసి పనులు చేపట్టారు. అనంతరం మాట్లాడుతూ… గోలివాడ గోదావరి తీరంలో ఉన్న సమక్క- సారలమ్మ గద్దెలు బ్యాక్‌ వాటర్‌ రావడంతో మునిగిపోయాయని, దీంతో అమ్మవార్ల గద్దెల నూతనంగా నిర్మాణం చేశామన్నారు. అమ్మవార్ల జాతర ఫిబ్రవరి 15న మెదలై 18న ముగుస్తుందని, జారతకు కావాల్సిన సదుపాయలను భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాటు చేస్తామన్నారు. అమ్మవార్ల దీవెనలు రామగుండం ప్రజలపై ఉండి అందరూ చల్లగా చూడాలన్నారు. సమ్మక్క సారలమ్మ గద్దెల పునర్నిర్మాణానికి తమవంతుగా సహాయ సహకారాలు అందిస్తామన్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement