Saturday, April 27, 2024

Breaking : న‌డ్డా వ్యాఖ్య‌ల‌ని ఖండిస్తున్నాం – న‌రేంద్ర మోడీ రైతు విరోధి – మంత్రి కేటీఆర్

బిజెపి జాతీయ అధ్య‌క్షుడు జేపీ న‌డ్డా కామెంట్స్ ని ఖండిస్తున్నామ‌ని మంత్రి కేటీఆర్ అన్నారు. న‌డ్డాకు ,బండి సంజ‌య్ కు పెద్ద‌గా తేడా లేద‌న్నారు. జేపీ న‌డ్డా చిల్ల‌ర‌గా మాట్లాడార‌ని మండిప‌డ్డారు కేటీఆర్. ఆయ‌న మాట‌లు చాలా జుగుప్సాక‌రంగా ఉన్నాయ‌ని మంత్రి తెలిపారు. బిజెపి పార్టీ అంటే బ‌క్వాస్ జుమ్లా పార్టీ అని అర్థం చెప్పారు కేటీఆర్. ఏడున్న‌రేళ్ళ‌లో బిజెపి చేసింది గుండు సున్నా అని అన్నారు. పంజాబ్ లో రైతులు మోడీని అడ్డుకున్నారు. 20నిమిషాలు రోడ్డుపైనే ఆగిపోయారు. దేశంలో ఏ ప్ర‌ధానికి ఇటువంటి గ‌తి ప‌ట్ట‌లేద‌ని ఎద్దేవా చేశారు. న‌రేంద్ర మోడీ రైతు విరోధి అన్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement