Sunday, May 5, 2024

సబ్బితం వాటర్ ఫాల్స్ సందర్శన నిషేధం – రామగుండం సిపి రెమా రాజేశ్వరి

రామగుండం – సబితం వాటర్ ఫాల్స్ సందర్శన నిషేధించినట్లు రామగుండం పోలీస్ కమిషనర్ రెమ రాజేశ్వరి తెలియజేశారు. శనివారం వాటర్ ఫాల్స్ ను సందర్శించి ప్రమాదాల నియంత్రణకు చేపట్టిన ఏర్పాట్లను పరిశీలించారు. అనంతరం మాట్లాడుతూ వాటర్ ఫాల్స్ వద్ద నీటి ప్రవాహం ఉధృతంగా ఉందని, ప్రజలను సందర్శనకు అనుమతి ఇవ్వడం లేదన్నారు. ముందుగానే పోలీసులు చర్యలు చేపట్టి బారికైడింగ్ ఏర్పాటు చేశారని, ఫ్లెక్సీలు సైతం ఏర్పాటు చేశారన్నారు. ఆహ్లాదం కోసం వచ్చి ప్రమాదాల బారిన పడవద్దని సూచించారు.

సిపి వెంట డిసిపి వైభవ్ గైక్వాడ్, ఏసీపీలు మహేష్, శ్రీనివాసరావు, సీఐ అనిల్ కుమార్ ఎస్ఐ వెంకటేష్, శబ్బితం సర్పంచ్ సదయ్య తో పాటు పలువురు ఉన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement