Friday, April 26, 2024

పెద్దపల్లిలో ఘనంగా రైతుబంధు సంబరాలు

పెద్దపల్లి నియోజకవర్గంలో రైతుబంధు సంబరాలు అత్యంత ఘనంగా జరుగుతున్నాయి. బుధవారం జిల్లా కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ లో అత్యధిక ధరకు పత్తి విక్రయించిన రైతులను రైతుబంధు సంబరాల్లో భాగంగా జిల్లా వ్యవసాయ అధికారి తిరుమల ప్రసాద్ శాలువాతో సత్కరించారు. మార్కెట్ యార్డ్ లో పత్తిని క్వింటాలుకు రైతులు ఎం.అనిల్,గుర్రంపల్లి (రూ.9752), నిజాం ( రూ.9744), జె.దేవేందర్ (రూ.9741) ఎం.సరోజ (రూ.9751) విక్రయించగా వారిని శాలువాలతో సన్మానం చేశారు. జిల్లా వ్యవసాయ శాఖ అధికారి తిరుమల ప్రసాద్ రైతుబంధు నిధుల విడుదల గురించి వివరించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement