Friday, March 29, 2024

ఎయిర్‌పోర్ట్ కు ల్యాండ్ ఇచ్చాం.. విజ‌య‌వాడ జేసీ ఆఫీసు ద‌గ్గ‌ర రైతుల ఆందోళ‌న‌..

విజయవాడ: విజయవాడలోని జాయింట్ కలెక్టర్ క్యాంపు కా‌ర్యాలయం వద్ద విమానాశ్రయానికి భూములిచ్చిన రైతులు, నిర్వాసితులు ఆందోళన చేపట్టారు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే వల్లభనేని వంశీ జాయింట్ కలెక్టర్ కార్యాలయం చేరుకున్నారు. గన్నవరం విమానాశ్రయం రన్ వే విస్తరణ కోసం భూములిచ్చిన రైతులు, నిర్వాసితులను వంశీ స్వయంగా జాయింట్ కలెక్టర్ మాధవిలత వద్దకు తీసుకువెళ్లి చర్చించారు.

విమానాశ్రయం నిర్వాసితులకు ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ కింద ఇళ్ల నిర్మాణం, రైతులకు రాజధానిలో భూములు ఇచ్చే విషయం, నష్ట పరిహారం విషయాలపై జాయింట్ కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement