Wednesday, May 8, 2024

శ‌బ‌రిమ‌ల యాత్ర‌కు ఆర్టీసీ బ‌స్సులు – డీఎం ల‌క్ష్మీ ధ‌ర్మ‌

ప్రముఖ పుణ్య క్షేత్రం శబరిమల యాత్రకు వెళ్లే అయ్యప్పస్వామి భక్తులకు అందుబాటులో ఆర్టీసీ బస్సులున్నాయని జనగామ ఆర్టీసీ డిపో మేనేజర్ ఎన్.లక్ష్మీ ధర్మ తెలిపారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ…. ప్రతి ఏటా జనగామ ప్రాంతం నుండి శబరిమలకు అయ్యప్పస్వామి భక్తులు పెద్ద ఎత్తున తరలివెళ్తార‌ని, ఈ నేపథ్యంలో వారికి అందుబాటులో ఆర్టీసీ బస్సులను ఏర్పాటు చేశామని, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. ఆర్టీసీలో నిష్ణాతులైనటువంటి డ్రైవర్లున్నారని, ఎలాంటి భయం లేకుండా బస్సు బుక్ చేసుకుని వెళ్లవచ్చన‌ని ఆయన అన్నారు. 36 సీట్లు ఉన్న సూపర్ లగ్జరీ బస్సులను కిలోమీటర్ కు 48.96 రూపాయలు, 40 సీట్లు ఉన్న డీలక్స్ బస్సులకు కిలోమీటర్ కు రూ.47.20లు, 48 సీట్లు ఉన్న డీలక్స్ బస్సులకు కిలోమీటర్ కు రూ.56.64లు, 49 సీట్లున్న‌ ఎక్స్ ప్రెస్ బస్సులకు కిలోమీటర్ కు రూ.52.43 పైసల చొప్పున చార్జి విధిస్తామని తెలిపారు. బస్ బుక్ చేసుకున్న వారికి రోజుకు 3 వందల రూపాయల చొప్పున అన్ని రోజులకు కమిషన్ ఇస్తామని, ఇద్దరు మణికంఠ స్వాములకు, ఇద్దరు వంట వారికి, భక్తుల లగేజీ సహాయకునికి ప్రయాణం కల్పించబడునని తెలిపారు. జిల్లా ప్రజలు, ప్రయాణికులు, అయ్యప్పస్వామి భక్తులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని, సురక్షితమైన ప్రయాణం చేయాలని జనగామ ఆర్టీసీ డిపో మేనేజర్ ఎన్.లక్ష్మీ ధర్మ తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement