Tuesday, May 14, 2024

ఆటోను ఢీకొట్టిన ఆర్టీసీ బ‌స్సు.. స్పాట్‌లోనే ఇద్ద‌రు మృతి

హ‌నుమ‌కొండ జిల్లాలోని అనంత సాగ‌ర్ స‌మీపంలో బుధ‌వారం రాత్రి ఘోర రోడ్డుప్ర‌మాదం చోటు చేసుకుంది. ఎస్ఆర్ యూనివ‌ర్సిటీ క్యాంప‌స్ వ‌ద్ద ఆర్టీసీ బ‌స్సు – ఆటో ఢీకొన్నాయి. ఈ ప్ర‌మాదంలో ఆటోలో ప్ర‌యాణిస్తున్న ఇద్ద‌రు యువ‌కులు మృతి చెందారు. మృతుల్లో ఒక‌రు ఆటో డ్రైవ‌ర్ ఉన్నారు.

మృతుల‌ను బావుపేట్ గ్రామానికి చెందిన‌ మంద శ్రీనివాస్(26), అనుదీప్(25) గా పోలీసులు గుర్తించారు. మృత‌దేహాల‌ను స్వాధీనం చేసుకుని, పోస్టుమార్టం నిమిత్తం ఎంజీఎం ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. కేసు న‌మోదు చేసుకుని ద‌ర్యాప్తు చేప‌ట్టిన‌ట్టు హ‌స‌న్‌ప‌ర్తి ఎస్ఐ ర‌వి కిర‌ణ్ పేర్కొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement