Tuesday, May 7, 2024

లియోనియా రిసార్టులో పేకాట డెన్.. పోలీసుల దాడిలో మూడు కార్లు, 7 ల‌క్ష‌ల న‌గ‌దు స్వాధీనం

శామీర్ పేట, (ప్రభాన్యూస్ ): రంగారెడ్డి జిల్లాలోని శామీర్ పేట పోలీస్ స్టేషన్ పరిధిలోని లియోనియా రిసార్టులో పేకాట స్థావరంపై ఎస్ ఓ టీ పోలీసులు బుధవారం సాయంత్రం మెరుపు దాడి చేశారు. ఈ క్ర‌మంలో 19 మంది పేకాట రాయుళ్లను అరెస్ట్ చేశారు. వారి నుంచి 7 లక్షల నగదు, 18 సెల్ ఫోన్లు, 3 కార్లు స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.

నిందితులు జవహర్ నగర్, కాప్రా తదితర ప్రాంతాలకు చెందిన వారని తెలిపారు. బాలానగర్ ఎస్ ఓ టీ, శామీర్ పేట పోలీసులు సంయుక్తంగా దాడులు నిర్వహించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ ఐ రవి కుమార్ తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement