Thursday, May 16, 2024

పులాజీ బాబా ఆలయ అభివృద్ధికి రూ.50 లక్షలు మంజూరు :ఎమ్మెల్యే

జైనూర్, జులై 3( ప్రభ న్యూస్) కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలోని జైలు మండలంలో గల పాట్నాపూర్ లోని సద్గురు పులాజి బాబా సిద్దేశ్వర ఆలయ అభివృద్ధికి 50 లక్షలు మంజూరు చేస్తానని దేవాదాయశాఖ మంత్రి ఐ కే రెడ్డి హామీ ఇచ్చారని ఎమ్మెల్యే ఆత్రం సక్కు అన్నారు. సోమవారం పట్నాపూర్ లో మీ సిద్దేశ్వర సంస్థలో జరిగిన గురు పౌర్ణమి వేడుకల్లో ఆయన పాటు కొమరం భీం జిల్లా జడ్పీ చైర్ పర్సన్ కోవలక్ష్మి పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు సద్గురు కులాజి బాబా సమాధి మఠంలో ప్రత్యేక పూజలు చేసి బాబా ఆశీస్సులు పొందారు వచ్చిన భక్తుల కోసం సంస్థాన్ కమిటీ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు వందల సంఖ్యలో భక్తులు రావడంతో జైనూర్ ఎస్సై మధుకర్,ఏఎస్ఐ ఉమేష్ అద్వైరంలో పోలీసు బందో బస్తు నిర్వహించారు.

ఈ వేడుకల్లో ఎమ్మెల్యేతో పాటు గజిటెడ్ ఉద్యోగుల సంఘం ఉమ్మడి జిల్లా అధ్యక్షులు అజ్మీర శ్యాం నాయక్ ఉమర్ఖేడ్ మాజీ ఎమ్మెల్యే ఉత్తమ్రావు ఇంగిలే, పట్నాపూర్ సర్పంచ్ కందారే బాలాజీ, జైనూర్ ఎంపీపీ తిరుమల విశ్వనాథ్, వైస్ఎంపీపీ లు కోవ అరుణ,చిర్లే లక్ష్మణ్ యాదవ్ ,,సిద్దేశ్వర సంస్థన్ అధ్యక్షులు కేశవ్ ఇంగిలే వామన్ రావుఇంగిలే, కార్యదర్శిలు దుక్రే సుభాష్, జనార్దన్, దాదా రావు, ప్రజాప్రతినిధులు అధికారులు ప్రముఖులు భక్తులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement