Friday, April 26, 2024

మాణిక్ రావు ఠాక్రే తో రేవంత్ రెడ్డి భేటీ

తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జి మాణిక్ రావు ఠాక్రే తో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జి గా నియమితులైన తర్వాత తొలిసారిగా ఆయన రాష్ట్రానికి విచ్చేశారు. ఈ సందర్భంగా ఆయనకి శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో కాంగ్రెస్ నేతలు ఘన స్వాగతం పలికారు. అనంతరం గాంధీ భవన్ లో నిర్వహించిన సమావేశంలో ఠాక్రే పాల్గొన్నారు. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్కతో ఠాక్రే సమావేశమయ్యారు. అరగంట పాటు రేవంత్ రెడ్డి తో మీటింగ్ కొనసాగింది. ఆ తర్వాత రాజకీయ వ్యవహారాల కమిటీలోని భట్టి, ఇతర సభ్యులు ఒక్కొక్కరితో ఠాక్రే మాట్లాడుతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement