Sunday, May 5, 2024

Sangareddy | ఆందోళనలపై ఆంక్షలు​.. నెలరోజులపాటు పోలీసుల యాక్ట్​ అమలు!

ఉమ్మడి మెదక్​ బ్యూరో, (ప్రభ న్యూస్​): సంగారెడ్డి జిల్లాలో శాంతి భద్రతలను దృష్టిలో ఉంచుకుని నెల రోజుల పాటు జిల్లా వ్యాప్తంగా 30, 30(ఎ) పోలీసు యాక్ట్ అమలులో ఉంటుందని జిల్లా ఎస్పీ ఎం.రమణ కుమార్  తెలిపారు. పోలీసు అధికారుల ముందస్తు అనుమతి లేకుండా జిల్లా ప్రజలు, ప్రజా ప్రతినిధులు ధర్నాలు, రాస్తారోకోలు, నిరసనలు, ర్యాలీలు, పబ్లిక్ మీటింగ్​లు, సభలు, సమావేశాలు నిర్వహించరాదని తెలిపారు.

ప్రజా ధనానికి నష్టం కల్గించే, చట్ట వ్యతిరేక కార్యకలాపాలు చేపట్టకూడదన్నారు.  జిల్లా ప్రజలు, ప్రజా ప్రతినిధులు, వివిధ సంఘాల నాయకులు ఈ విషయంలో పోలీసులకు సహకరించాలని కోరారు. అనుమతి లేకుండా ఎలాంటి యాక్టివిటీస్​ చేపట్టినా కఠిన చర్యలుంటాయని హెచ్చరించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement