Monday, April 29, 2024

రియల్ ఎస్టేట్ వ్యాపారి కిడ్నాప్ కలకలం

ఒక రియ‌ల్ ఎస్టేట్ వ్యాపారి కిడ్నాప్ న‌కు గురైన ఘ‌ట‌న‌ హైదరాబాద్ లో చోటుచేసుకుంది. న‌గ‌రంలోని కింగ్ కోటి సమీపంలో ఈ ఘటన చోటుచేసుకుంది. నాంపల్లిలోని ఆగపురకు చెందిన గయాజ్ భాషా రియల్ ఎస్టేట్ వ్యాపారి. ఆయన వయసు అరవై ఏళ్లు. గ‌త‌ అర్థరాత్రి కింగ్ కోటి ఈడెన్ గార్డెన్ వద్ద ఉండగా భాషాను కొందరు గుర్తు తెలియని వ్యక్తులు వచ్చి కారులో కిడ్నాప్ చేశారు. ఆయ‌న ఓ వివాహా కార్య‌క్ర‌మానికి హాజరై ఇంటికి వెళుతుండగా కిడ్నాప్ జరిగింది. కిడ్నాప్ నకు గల కారణాలు తెలియరాలేదు. వ్యక్తిగత కక్షలా? వ్యాపార సంబంధమైన సమస్యలా ? ఆర్థిక లావాదేవీలా ? అన్న దానిపై అనుమానాలున్నాయి. గయాజ్ భాషా కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement