Sunday, April 28, 2024

ఓటు నమోదు శిబిరాన్ని సందర్శించిన ఆర్డీఓ సూర్యనారాయణ

అనంతగిరి సెప్టెంబర్ 03 (ప్రభ న్యూస్) :మండలంలో ఓటు నమోదు ప్రత్యేక శిబిరాలు ఆదివారం సైతం కొనసాగనున్నాయి.తొలి విడుత ప్రత్యేక నమోదు శిబిరాలను గత నెల చివరి వారంలో నిర్వహించగా.. తాజాగా 2,3, తేదీల్లో నిర్వహించారు. ఈ మేరకు ఆదివారం ప్రత్యేక ఓటు నమోదు స్పెషల్‌ డ్రైవ్‌ లో భాగంగా ఆర్డీఓ సూర్యనారాయణ మండల పరిధిలోని శాంతినగర్ గ్రామంలో ఏర్పాటు చేసిన ఓటు నమోదు శిబిరాన్ని సందర్శించి వివరాలు అడిగి తెలుసుకున్నారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అక్టోబర్‌ 1వ తేదీ లోపు 18 సంవత్సరాలు పూర్తి చేసుకున్న వారు ఓటు హక్కును నమోదు చేసుకోవాలని చెప్పారు.ఓటరు జాబితాలోని తప్పుఒప్పొలను సరి చేసుకోవచ్చని తెలిపారు.గ్రామాల్లో బీఎల్ఓలతో కలిసి మహిళా సంఘాల సభ్యులు ఇంటింటికి తిరిగి ఓటరు జాబితాపై అవగాహన కల్పించాలని తహసీల్దార్‌ రవి కుమార్ సూచించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement