Friday, May 3, 2024

సబ్ స్టేషన్ కోసం ఆమరణ దీక్ష … జోరు వానలోనూ విశ్రమించని విక్రమార్కుడు

జన్నారం, సెప్టెంబర్ 3 (ప్రభ న్యూస్): పట్టు వదలని విక్రమార్కుడిలా ఒకే ఒక్కడు భారీ వర్షం లోను ఉరుములు మెరుపులకు లెక్కచేయకుండా రిలే నిరాహార దీక్షను కొనసాగిస్తున్నారు. మంచిర్యాల జిల్లా జన్నారం మండల కేంద్రంలో 132 కెవి విద్యుత్ సబ్ స్టేషన్ ఏర్పాటు చేయాలని సామాజిక ఉద్యమకారుడు, విద్యుత్ సబ్ స్టేషన్ సాధన సమితి నేత శ్రీరాముల భూమాచారి పట్టు వదలని విక్రమార్కుడిలా భారీ వర్షంలోనూ ఆదివారం నిరాహార దీక్షను కొనసాగించారు.

అతను చేస్తున్న దీక్ష ఏడవ రోజుకు చేరుకుంది. మండల కేంద్రంలో మధ్యాహ్నం ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షం కురుస్తున్నప్పటికీ సబ్ స్టేషన్ సాధన లక్ష్యంలో భారీ వర్షం లోను భయపడకుండా దీక్ష చేస్తున్నారు. వెంటనే అధికారులు స్పందించి సబ్ స్టేషన్ ఏర్పాటు విషయంలో హామీ ఇచ్చి, అతని దీక్షను విరమింప చేయాలని పలువురు కోరారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement