Wednesday, May 1, 2024

రేప్ కేసు నిందితులు ఎవ‌రైనా స‌రే క‌ఠినంగా శిక్షిస్తాం: తెలంగాణ హోం మంత్రి

హైద‌రాబాద్‌లోని జూబ్లీహిల్స్‌లో బాలిక అత్యాచార ఘ‌ట‌న‌లో నిందితులు ఎవ‌రైనా స‌రే క‌చ్చితంగా క‌ఠినంగా శిక్షిస్తామ‌ని తెలంగాణ హోంమంత్రి మ‌హ‌మూద్ అలీ స్ప‌ష్టంచేశారు. హోదాతో సంబంధంలేకుండా నిందితుల‌ను శిక్షించాల‌ని మంత్రి కేటీఆర్ చేసిన ట్వీట్‌పై మ‌హ‌మూద్ అలీ స్పందించారు. ఇది దారుణ‌మైన ఘ‌ట‌న అని మ‌హ‌మూద్ అలీ తీవ్ర దిగ్భ్రాంతి వ్య‌క్తంచేశారు.

నిందితులు ఎంత‌టివారైనా ఉపేక్షించ‌బోమ‌న్నారు హోం మంత్రి మ‌హ‌మూద్ అలీ. వారి నేప‌థ్యంతో సంబంధం లేకుండా క‌ఠిన చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని స్ప‌ష్టంచేశారు. నిందితుల‌ను వీలైనంత త్వ‌ర‌గా అరెస్టు చేయాల‌ని ఇప్ప‌టికే పోలీసుల‌కు ఆదేశాలు జారీచేశామ‌న్నారు. డీజీపీ, హైద‌రాబాద్ సీపీ స‌మ‌న్వ‌యంగా అదే విష‌య‌మై ద‌ర్యాప్తు చేస్తున్నార‌ని, కేసు వేగ‌వంతం చేసిన‌ట్లు చెప్పారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement