Saturday, May 4, 2024

ముగిసిన జడ్పీ స్టాండింగ్ కమిటీ సమావేశాలు

రంగారెడ్డి : జడ్పీ స్టాండింగ్ కమిటీ సమావేశాలు ముగిశాయి. గురువారం కీలక శాఖల సమీక్షా జరిగింది. జడ్పీ చైర్ పర్సన్ డాక్టర్ తీగల అనితా రెడ్డి అధ్యక్షతన సమావేశాలు జరిగాయి. కల్వకుర్తి ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ హాజరయ్యారు. కడ్తల్ లో వేలాది ఎకరాల్లో వెంచర్లు వేస్తూ గ్రామ పంచాయతీలకు 10శాతం రిజిస్ట్రేషన్ చేయడం లేదని, దీనిపై దృష్టి పెట్టాలని చైర్ పర్సన్ అనితా రెడ్డి.. ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ అధికారులను ఆదేశించారు. రేషన్ బియ్యం పక్కదారి పడుతున్నాయని, దీనిపై పక్కాగా నిఘా పెట్టాలని వారు సూచించారు. విద్యా వైద్యం గ్రామీణాభవృద్ధి పనులు ఆర్థిక శాఖ సమీక్ష కూడా జరిగింది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement