Friday, May 3, 2024

‘భీమ్లా నాయ‌క్’ టీంకి శుభాకాంక్ష‌లు – ట్వీట్ చేసిన మంత్రి కేటీఆర్

నిన్న భీమ్లా నాయ‌క్ చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్ ఘ‌నంగా జ‌రిగింది. ఈ వేడుక‌కు మంత్రి కేటీఆర్ ముఖ్య అతిథిగా హాజ‌ర‌యిన సంగ‌తి తెలిసిందే. తాజాగా నేడు మంత్రి కేటీఆర్ ట్విట్టర్ ద్వారా స్పందించారు. తన సోదరులు పవన్ కల్యాణ్, దగ్గుబాటి రానా, తమన్, సాగర్ చంద్రల చిత్రం ‘భీమ్లా నాయక్’ విడుదల సందర్భంగా వారికి శుభాకాంక్షలు తెలియజేయడానికి రొటీన్ నుంచి కొంత విరామం తీసుకున్నానని ఆయన చెప్పారు. మొగిలయ్య, శివమణి వంటి బ్రిలియంట్ సంగీత విద్వాంసులను కలవడం చాలా సంతోషంగా ఉందని అన్నారు. ఈ మేర‌కు ఆయ‌న ట్వీట్ చేశారు.ఈ చిత్రంలో ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్, హీరో రానా ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టించారు. కాగా రేపు ఈ మూవీ థియేట‌ర్ల‌లో రిలీజ్ కానుంది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement