Wednesday, May 8, 2024

RR | లారీ కింద పడి ఇద్దరు మృతి

పూడూర్, ప్రభా న్యూస్ : పూడూరు మండల పరిధిలోగల చంగముల్ పోలీస్ స్టేషన్ సమీపంలో బైక్ పై వెళుతున్న ఇద్దరు మృతి చెందారు. చంగముల్ ఎస్సై గిరి తెలిపిన వివరాల ప్రకారం.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నెల్లూరు టౌన్ కు చెందిన సురేంద్ర కుమార్ (28 సం) గత కొంతకాలంగా పరిగిలో హోటల్ నడుపుకుంటున్నారు.

మంగళవారం రోజు సురేంద్ర కుమార్, లక్ష్మితో కలిసి మోటార్ బైక్ పై హైదరాబాద్ వెళ్తున్నారు. వికారాబాద్ వైపు వస్తున్న డీసీఎంను తప్పించబోయి బైకు అదుపుతప్పి కింద పడడంతో అటు నుంచి వస్తున్న లారీ వారి ఇరువురిపై వెళ్లడంతో అక్కడికక్కడే మృతి చెందారు. తల్లి శారద ఫిర్యాదు మేర కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు చనుగములు ఎస్సై గిరి తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement