Tuesday, May 7, 2024

కౌన్సిలర్ ఉపఎన్నికలో పోటీకి టీఆర్ఎస్ దూరం

జల్‌పల్లి: రంగారెడ్డి జిల్లా జల్‌పల్లి మున్సిపాలిటీలోని 28వ వార్డు కౌన్సిలర్ ఉపఎన్నికలో పోటీకి టీఆర్ఎస్ దూరంగా ఉండాలని నిర్ణయించింది. ఈ ఉపఎన్నికల ఏకగ్రీవం కోసం ఎంఐఎం పార్టీ చేసిన విజ్ఞప్తికి గులాబీ బాస్ పచ్చజెండా ఊపారు. యాకుత్‌పురా ఎమ్మెల్యే సయ్యద్ హైమద్ పాషా ఖాద్రీ నేతృత్వంలోని ఎంఐఎం పార్టీ ప్రతినిధుల బృందం నేడు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డిని కలిశారు. కౌన్సిలర్‌ నాజియా బేగం మృతి చెందడంతో ఆమె స్థానంలో వారి కోడలు తైసీమ్‌ బేగంకు మద్దతు తెలపాలని ఆమెను కోరారు. ఈ మేరకు ఈ విషయాన్ని సీఎం కేసీఆర్, పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ల దృష్టికి తీసుకెళ్లిన సబీత వారి అనుమతి మేరకు పోటీకి దూరంగా ఉండాలని నిర్ణయించినట్లు మంత్రి సబితా ప్రకటించారు. టీఆర్ఎస్ నిర్ణయం పట్ల ఎమ్మెల్యే పాషా ఖాద్రి, జల్పల్లి మున్సిపల్ ఛైర్మన్‌తో పాటు అభ్యర్థి కుటుంబసభ్యులు హర్షం వ్యక్తం చేశారు

Advertisement

తాజా వార్తలు

Advertisement