Saturday, May 18, 2024

బ్రేకింగ్ -శంషాబాద్ లో ఘోర రోడ్డు ప్రమాదం… నలుగురు మృతి

శంషాబాద్లో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో నలుగురు మృతి చెందారు. ఆగి ఉన్న కారును ఓ లారీ వెనకనుంచి ఢీ కొట్టడం తో ఈ ప్రమాదం జరిగింది. ఈఘటనలో నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు. లారీలో ఉన్న 15 మందికి తీవ్రగాయాలయ్యాయి.

అంతేకాకుండా ఆరుగురు లారీ కింద చిక్కుకోగా.. వారిని స్థానికులు బయటకు తీశారు. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించారు.
కాగా ప్రమాద సమయంలో లారీలో 30 మంది కార్మికులు ఉన్నట్లు తెలుస్తోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement