Sunday, May 19, 2024

దేశానికి త్యాగమూర్తులు చేసిన సేవలు మరువలేనివి : ప్రతాప్ రెడ్డి

షాద్ నగర్. (ప్రభ న్యూస్) : ఎందరో మహానుబావుల త్యాగాల ఫలితంగానే భారతదేశానికి స్వాతంత్రం వచ్చిందన్నారు. దేశానికి త్యాగమూర్తుల చేసిన సేవలు, త్యాగాలు మరువలేనివని షాద్నగర్ మాజీ ఎమ్మెల్యే చౌలపల్లి ప్రతాప్ రెడ్డి అన్నారు. 77వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను మంగళవారం షాద్నగర్ పట్టణంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే చౌలపల్లి మున్సిపాలిటీ కార్యాలయం, గ్రంథాలయం, కేశంపేట రోడ్డులో సహకార సంఘం, ఎంపీడీవో ఆఫీస్, ఎమ్మార్వో ఆఫీస్, ఆర్డిఓ ఆఫీస్ లో నిర్వహించిన స్వతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు.

అనంతరం ప్రతాప్ రెడ్డి క్యాంపు కార్యాలయం ఆవరణలో మాజీ ఎమ్మెల్యే చౌలపల్లి ప్రతాప్ రెడ్డి జాతీయ జెండాను ఆవిష్కరించారు. అదేవిధంగా సాయి బాలాజీ టౌన్షిప్ లో సాయిబాబా కాలనీలో భగీరథ డ్రీం విల్లాస్ కాలనీలో జాతీయ జెండాను ఎగరవేసి స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎందరో మహానుభావుల త్యాగఫలం వలనే నేడు మనం స్వేచ్చా వాయువులు పీలుస్తున్నామని అన్నారు.

ప్రతి ఇంటా విద్యావంతులైన తల్లిదండ్రులు తమ పిల్లలకు చిన్ననాటి నుంచే దేశభక్తిని పెంపొందించేలా దేశ స్వాతంత్రం కోసం అసువులు బాసిన అమరవీరుల చరిత్రను కథలుగా చెబుతూ దేశం పట్ల భక్తి, విశ్వాసాలు పెంపొందించేందుకు కృషి చేయాలని తెలిపారు. స్వాతంత్రం కోసం అసువులు బాసిన అమరవీరులను గుర్తు చేసుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రతాపన్న యువ సైన్యం తదితరులు పాల్గొన్నారు

Advertisement

తాజా వార్తలు

Advertisement