Sunday, April 28, 2024

పదిలో ఫెయిల్​.. మనస్తాపంతో విద్యార్ధి ఆత్మహత్య

దోమ, (ప్రభన్యూస్) : పదవ తరగతి సప్లమెంటరీ పరీక్షల్లో ఫెయిల్ అవ్వడంతో విద్యార్థి ఆత్మహత్య చేసుకున్న ఘటన దోమ మండల పరిధిలోని కిష్టాపూర్ గ్రామంలో చోటుచేసుకుంది. దోమ ఎస్సై విశ్వజన్ కథనం ప్రకారం కిష్టాపూర్ గ్రామానికి చెందిన నందు గ్రామంలోని పాఠశాలలో పదవ తరగతి చదువుతున్నాడు.

ఇటీవల పదవ తరగతి ఫలితాల్లో ఫెయిల్ కావడంతో మరొకసారి సప్లమెంటరీ పరీక్షలు రాశాడు. సప్లమెంటరీ పరీక్షలు కూడా ఫెయిల్ కావడంతో మనస్థాపానికి గురైన నందు గ్రామ సమీపంలోని చెట్టుకు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుని తండ్రి నర్సింలు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు పేర్కొన్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement