మహా శివరాత్రి పర్వదినం సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రజలకు విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. మహేశ్వరం మండల కేంద్రంలోని రామలింగేశ్వర ఆలయంలో మహా శివరాత్రి సందర్భంగా పరమేశ్వరునికి అభిషేకం నిర్వహించి, ప్రత్యేక పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ…నిబద్దతకు, అచంచల విశ్వాసానికి, త్యాగానికి ప్రతీకగా ఉపవాస దీక్షలతో, జాగరణలతో శివరాత్రి పండుగను హిందువులు జరుపుకుంటారని, సృష్టి లయకారునిగా శివున్ని భక్తి ప్రపత్తులతో కొలుచుకుంటారన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రజలకు, ఆ మహాశివుడు ఆయురారోగ్యాలను, సుఖ సంతోషాలను ప్రసాదించాలని మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఆ పరమేశ్వరుడిని వేడుకున్నారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి..
#AndhraPrabha #AndhraPrabhaDigital