Saturday, April 27, 2024

శివగంగా దేవాలయంలో సబితారెడ్డి పూజలు


మహా శివరాత్రి పర్వదినం సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రజలకు విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. మహేశ్వరం మండల కేంద్రంలోని రామలింగేశ్వర ఆలయంలో మహా శివరాత్రి సందర్భంగా పరమేశ్వరునికి అభిషేకం నిర్వహించి, ప్రత్యేక పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ…నిబద్దతకు, అచంచల విశ్వాసానికి, త్యాగానికి ప్రతీకగా ఉపవాస దీక్షలతో, జాగరణ‌లతో శివరాత్రి పండుగను హిందువులు జరుపుకుంటారని, సృష్టి లయకారునిగా శివున్ని భక్తి ప్రపత్తులతో కొలుచుకుంటారన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రజలకు, ఆ మహాశివుడు ఆయురారోగ్యాలను, సుఖ సంతోషాలను ప్రసాదించాలని మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఆ పరమేశ్వరుడిని వేడుకున్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement