Monday, April 29, 2024

శంకర్ పల్లి అభివృద్ధికి రూ.25కోట్లు మంజూరు..

శంకర్ పల్లి (ప్రభ న్యూస్) శంకర్పల్లి మున్సిపాలిటీ మరింత అభివృద్ధి పథంలో దూసుకుపోయేందుకు రూ.25 కోట్ల రుణం మంజూరైంది. ఈసందర్భంగా రుణం మంజూరు చేసిన రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు కు, రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డికి, చేవెళ్ల పార్లమెంట్ సభ్యులు గడ్డం రంజిత్ రెడ్డికి, తమ వెన్నంటే ఉండి తమను ఎప్పటికప్పుడు ప్రోత్సహిస్తూ తమ అభివృద్ధిని కాంక్షిస్తున్న చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్యకు శంకర్పల్లి మున్సిపల్ చైర్ పర్సన్ విజయలక్ష్మి ప్రవీణ్ కుమార్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement