Friday, April 26, 2024

మాస్క్‌లు,శానిటైజర్‌ తో పాటు భౌతిక దూరం ముఖ్యం..

వికారాబాద్‌ :రోజు రోజుకు విజృంభిస్తోంది కరోనా. ఈ నేపథ్యంలో వికారాబాద్‌ పట్టణ ప్రజలు మాస్క్‌లు ధరించటంతో పాటు,భౌతిక దూరం పాటించాలని శానిటైజర్‌లు వాడాలని పట్టణ అధ్యక్షులు డి.ప్రభాకర్‌ రెడ్డి కోరారు. ఆయన ప్రభ న్యూస్‌తో మాట్లాడుతు గతం కంటే భయంకరంగా కరోనా వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరు తగిన జాగ్రత్తలు తీసుకోవటంతో పాటు అవసరం ఉంటేనే బయటకు రావాలని సూచించారు.ప్రతి ఒక్కరు తప్పని సరిగా వ్యాక్సిన్ తీసుకోవాలని వాక్సిన్‌ పట్ల ఉన్న అపోహలను తొలగించుకోని ప్రభుత్వాలకు సహకరించాలని ఆయన కోరారు.ప్రజల ఆరోగ్య రక్షణ కోసం ప్రభుత్వాలు చేస్తున్న కృషికి అండగా నిలవాల్సిన బాధ్యత మనందరిపై ఉందని ఆయన గుర్తు చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement