Monday, April 29, 2024

ఎనిమిది మంది బైక్ దొంగల అరెస్ట్ – 11 ద్విచక్ర వాహనాలు స్వాధీనం

కర్నూలు జిల్లా డోన్ లో పట్టణ సీఐ టి,సుబ్రహ్మణ్యం, పట్టణ ఎస్ఐ యం, నరేష్ ల ఆధ్వర్యంలో పోలీస్ సిబ్బంది జరిపిన దాడుల్లో ఎనిమిది మంది బైక్ దొంగలను అరెస్ట్ చేశారు.. వారి నుంచి 11 ద్విచక్ర వాహనాలు స్వాధీనం చేసుకున్నారు, స్థానిక పట్టణ పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పట్టణ సీఐ, యస్ఐ లు మాట్లాడుతూ డోన్ పట్టణ వెలుపల 44 వ జాతీయ రహదారి దత్తాత్రేయ గుడి వద్ద 8 బైక్ దొంగలను,11 బైక్ లను స్వాదినం చేసుకున్నామన్నారు.. ఈ కేసులో పెద్దాముష్టి ప్రసన్న కుమార్(శ్రీనివాస నగర్, డోన్) ,షేక్ మౌలాలి (డోన్ మండలం ఓబుళపురం) ,ఈడిగ ఈశ్వరయ్య గౌడ్ (డోన్ టౌన్) ,మారబోయిన మహేష్ (పాఠపేట, డోన్) ,షేక్ రజాక్ (పాఠపేట, డోన్) ,తలారి విష్ణువర్ధన్ నాయుడు(డోన్ మండలం, వెంకట నాయనిపల్లె గ్రామం) ,పల్లె రాజు (డోన్ టౌన్) ,వట్టివేళ్ళ విష్ణు తేజ (డోన్ మండలం, వెంకట నాయనిపల్లె గ్రామం) లను అరెస్ట్ చేశామని చెప్పారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement