Thursday, April 18, 2024

మినీ ట్యాంక్‌బండ్‌..ఆనకట్ట నిర్మాణ పనులు..

దేవరకద్ర : మండల కేంద్రంలో మినీ ట్యాంక్‌ బండ్‌ నిర్మాణం పనులు అదే విధంగా ముచ్చింతల ఆనకట్ట నిర్మాణ పనులు త్వరితగతిన పూర్తి చేసేందుకు అధికారులు చర్యలు తీసుకోవాలని స్థానిక ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌ రెడ్డి ఇరిగేషన్‌ అధికారులను ఆదేశించారు. జరుగుతోన్న పనులపై ఇరిగేషన్‌ అధికారులతో ఎమ్మెల్యే సమీక్ష సమావేశం నిర్వహించారు. కోయిల్‌సాగర్‌ నుంచి రామన్‌పాడు వరకు ఉన్న ఊకచెట్టు వాగుపై పోల్కంపల్లి నుంచి సరళసాగర్‌ వరకు ఉన్న కందూరు పెద్ద వాగుపై నిర్మాణంలో ఉన్న చెక్‌ డ్యామ్‌ పనులు మే నెల ఆఖరు వరకు పూర్తి చేయాలని ఎమ్మెల్యే అధికారులను ఆదేశించారు. అలాగే ఈ రెండు పెద్ద వాగులపై ఇంకా ఎక్కడెక్కడ చెక్‌ డ్యామ్‌లు ఏర్పాటు చేయాల్సి ఉందో గుర్తించి ప్రతిఆదనలు సిద్దం చేయాలని అధికారులను ఎమ్మెల్యే ఆదేశించారు. మినీ ట్యాంక్‌బండ్‌ నిర్మాణం పనులు ఆనకట్ట నిర్మాణ పనులు త్వరితగతిన ప్రారంభించి పూర్తి చేసేందుకు చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే అధికారులను కోరారు. ఈ సమావేశంలో నర్సింగరావు , ప్రతాప్‌ సింగ్‌ , డిఈఈ లు చందులాల్‌ , ఏఈఈ శ్రీనివాస్‌ గౌడ్‌ , కాంట్రాక్టర్లు మెగా రెడ్డి , పురుషోత్తం రెడ్డి , కేవిఎన్‌ రెడ్డి , చంద్రయ్య పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement